జైనుల సమస్యలు పరిష్కరిస్తా -సుజనా చౌదరి
జైన్ సమాజ్ ఆధ్వర్యంలో మహవీర్ మహా జన్మదిన జయంతి వేడుకలు వన్ టౌన్ గుజరాతి సమాజ్ బిల్డింగ్ లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా టిడిపి వాణిజ్య విభాగం అధ్యక్షులు సోలంకి రాజేంద్రకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి పశ్చిమ నియోజకవర్గ ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. భగవాన్ మహావీర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సుజనా చౌదరి మాట్లాడుతూ భగవాన్ మహావీర్ చూపిన అహింస బాటలోనే జైనులంతా పయనించాలని అన్నారు. అహింసతోపాటు విద్య తోనే మంచి భవిష్యత్తు ఉంటుందనె నినాదాన్ని జైన సమాజం విస్తృతంగా ప్రచారం చేయడం అభినందనీయమని అన్నారు.సృష్టిలో నివసించే ఏ జీవిని హింసించకుండా హాని తలపెట్టకుండా జీవించాలని ఆ దిశగా సమాజాన్ని చైతన్య పరుస్తున్న జైన్ సమాజ్ ప్రతినిధులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. నియోజకవర్గంలోని జైనులందరికి తన సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని తమ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పొన్నాలాల్ జైన్ ప్రవీణ్ ఉత్తమ్ చంద్ బండారి పియూష్ దేశాయ్ కొణిజేటి రమేష్ పలువురు జైనులు పాల్గొన్నారు.

జ్యోతిని వెలిగిస్తున్న సుజనా చౌదరి



కార్యక్రమానికి హాజరైన జైన్ సమాజ్ ప్రతినిధులు