విజయవాడ పశ్చిమలో సుజనా విజయం కోసం టీడీపీ మాజీ కార్పొరేటర్, 41,42 డివిజన్ల క్లస్టర్ ఇన్ చార్జ్ యేదుపాటి రామయ్య అలుపెరుగని ప్రచారం చేస్తున్నారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని కోసంతోపాటు పశ్చిమలో సుజనాను గెలిపించాలంటూ ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తున్నారు. 42వ డివిజన్ లో మంగళవారం రామయ్య, ఇతర నేతలు ఇంటింటికీ తిరిగి ఎన్డీఏ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. రామయ్య వెంట బూత్ ఇన్ చార్జ్ లు నెలకుర్తి వెంకటరావు, అన్నాబత్తిన శ్రీనివాస్, మైనంపాటి రమేష్, కాశీ, పత్చవ మల్లికార్జున, వెంకట్, మహేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.